ప్రతిపక్షం, ఆగస్టు 05: టీమిండియా వికెట్కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. స్పోర్ట్స్ కోటా ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ)లో అసిస్టెంట్ మేనేజర్గా ఎంపికైన ఇషాన్ కిషన్, ప్రస్తుతం పట్నాలోని ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా టీ20 మ్యాచ్లకు విరామం లభించడంతో ఆయన బ్యాంక్ కార్యాలయానికి హాజరయ్యారు.
విధుల్లో భాగంగా కార్యాలయానికి వచ్చిన ఇషాన్ కిషన్తో బ్యాంక్ ఉద్యోగులు ఫొటోలు దిగగా, అవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ క్రికెటర్ ఉద్యోగ బాధ్యతలను కూడా సమానంగా నిర్వర్తించడం పట్ల అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
క్రీడా రంగంలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ఇషాన్ కిషన్, మైదానంలోనే కాకుండా ఉద్యోగ జీవితంలోనూ తన బాధ్యతలను నిర్వర్తించడం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఆయన బ్యాంక్లోని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

















