ప్రతిపక్షం, ఆగస్టు 10: నటి, ఎంపీ కంగనా రనౌత్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు హాజరైన సందర్భంగా ఆమె లుక్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నీలిరంగు సిల్క్ చీరలో సంప్రదాయ, ఆధునిక శైలిని కలగలిపిన లుక్లో కనిపించిన కంగనా ఫొటోలు వైరల్గా మారాయి.
అయితే ఆమె ధరించిన వస్తువుల ధరలపై సోషల్ మీడియాలో వివిధ రకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. కంగనా చేతికి ఉన్న రోలెక్స్ వాచ్ ధర సుమారు రూ.21 లక్షలు ఉంటుందని కొందరు పేర్కొంటున్నారు. అలాగే ఆమె పట్టుకున్న హ్యాండ్బ్యాగ్ విలువ దాదాపు రూ.35 లక్షలు ఉంటుందని పోస్టులు చేస్తున్నారు.
ఇక నీలిరంగు చీరకు సరిపోయేలా ఆమె పట్టుకున్న గొడుగు కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆ గొడుగు ధర సుమారు రూ.6,100 ఉంటుందని పలువురు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.
కంగనా పార్లమెంట్కు ఇలాంటి ఖరీదైన వస్తువులతో హాజరు కావడంపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె ఫ్యాషన్ ఎంపికను ప్రశంసిస్తుండగా.. మరికొందరు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఇంత ఖరీదైన వస్తువుల ప్రదర్శన అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు.
అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ధరల వివరాలకు అధికారిక ధృవీకరణ ఉందా లేదా అన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. మొత్తంగా కంగనా పార్లమెంట్ లుక్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మీ అభిప్రాయం ఏంటి?





























