ప్రతిపక్షం, ఆగస్టు 10: హైదరాబాద్లోని రంగారెడ్డి ప్రాంతీయ ఆర్టీసీ పరిధిలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో మొత్తం 13 ఖాళీలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. బీఈ, బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశానికి అర్హులు. అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. ఎంపికైన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.18 వేల నుంచి రూ.22 వేల వరకు స్టైపెండ్ అందించనున్నారు.
డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులకు కూడా అప్రెంటిస్ అవకాశాలు ఉన్నాయి. ఎంపికైన వారికి నెలకు రూ.16 వేల నుంచి రూ.19 వేల వరకు స్టైపెండ్ చెల్లించనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నాన్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
2022 నుంచి 2026 మధ్య ఆయా కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ విద్యార్హత ధ్రువపత్రాలతో ఆగస్టు 11న హైదరాబాద్లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
ప్రభుత్వ రంగ రవాణా సంస్థలో అప్రెంటిస్ అనుభవం పొందడంతో పాటు నెలవారీ స్టైపెండ్ అందుకునే అవకాశం ఉండటంతో అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు అవసరమైన పత్రాలను వెంట తీసుకెళ్లాలి.





























