ప్రతిపక్షం, ఆగస్టు 15: దాదాపు రెండు శతాబ్దాల బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం 1947 ఆగస్టు 15న విముక్తి పొందింది. స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధులు, ఉద్యమకారులు తమ జీవితాలను దేశానికి అంకితం చేశారు. వారి పోరాటాలు, త్యాగాల ఫలితంగానే భారతావనికి స్వేచ్ఛ లభించింది.
స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న వీరుల త్యాగాలు ప్రతి భారతీయుడిలో దేశభక్తిని నింపాయి. ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వారు సాగించిన పోరాటం వల్లే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం. వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల సేవలను మరోసారి గుర్తుచేసుకోవాలి. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుతూ అభివృద్ధి పథంలో ముందుకు సాగడమే వారికి మనం అందించే నిజమైన నివాళి. ప్రతి ఒక్కరూ దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలి.
80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. జైహింద్!





























