ప్రతిపక్షం, ఆగస్టు 15: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులు, సమరయోధుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి స్ఫూర్తితో దేశ ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగుతూ బలమైన, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
140 కోట్ల మంది భారతీయుల సమష్టి శక్తితో భారత్ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి సాధిస్తూ ప్రగతి పథంలో దూసుకెళ్తోందని ప్రధాని పేర్కొన్నారు. దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ ఐక్యత, సమగ్ర అభివృద్ధి కోసం పనిచేయాలని కోరారు.
భారత్ సాధించిన పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేయాలని మోదీ ఆకాంక్షించారు. భవిష్యత్తులోనూ దేశ అభివృద్ధి ప్రయాణం ఇదే స్ఫూర్తితో నిరంతరంగా కొనసాగాలని, భారతదేశం ప్రపంచంలో మరింత శక్తిమంతమైన దేశంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.





























